ఆరోగ్య సిబ్బందికి మరో 3 నెలలు బీమా
ABN , First Publish Date - 2020-06-22T06:29:48+05:30 IST
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రోగులకు ముందుండి చికిత్స అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమాను మరో 3 నెలలపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది...

న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రోగులకు ముందుండి చికిత్స అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమాను మరో 3 నెలలపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి వచ్చే సెప్టెంబరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.