క్వారంటైన్‌లో భారత వాయుసేన సిబ్బంది! తబ్లిగీ సమావేశాలతో లింక్?

ABN , First Publish Date - 2020-04-06T01:41:53+05:30 IST

భారత వాయుసేనకు చెందిన ముగ్గురు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు తబ్లీగీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్నట్టు వాయుసేన అధికారి ఒకరు తెలిపారు.

క్వారంటైన్‌లో భారత వాయుసేన సిబ్బంది! తబ్లిగీ సమావేశాలతో లింక్?

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన ముగ్గురు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు తబ్లీగీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్నట్టు వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. అయితే అతడు సమావేశాల్లో పాల్గొన్నాడా లేదా అనే దానిపై మాత్రం స్పష్టం లేదని, ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించామని సదరు అధికారి తెలిపారు. ముగ్గురూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని, అయితే వీరెవ్వరిలోనూ ఇంకా రోగ లక్షణాలు బయటపడలేదని తెలిపారు. 

Updated Date - 2020-04-06T01:41:53+05:30 IST