విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి... మరో ఇద్దరికి తీవ్రగాయాలు!
ABN , First Publish Date - 2020-09-16T15:43:47+05:30 IST
రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని నారాయణ్పురా గ్రామంలో ఒక పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు.

జాలోర్: రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని నారాయణ్పురా గ్రామంలో ఒక పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.