25 ఏళ్ల మహిళపై ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2020-10-05T02:24:08+05:30 IST

గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల మహిళపై నలుగురు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

25 ఏళ్ల మహిళపై ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల సామూహిక అత్యాచారం

చండీగఢ్: గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల మహిళపై నలుగురు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాల్‌గాళ్ అయిన యువతితో నిందితుల్లో ఒకడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సికందర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆమెను కలుసుకున్న నిందితుడు డీఎల్‌ఎఫ్ ఫేజ్ 2లోని ఓ స్థిరాస్తి కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో ముగ్గురు నిందితులు వేచి చూస్తున్నారు. అక్కడ వారిని చూసిన బాధితురాలు వెనక్కి వెళ్లిపోయిందుకు ప్రయత్నించగా, నలుగురూ కలిసి ఆమెను ఈడ్చుకెళ్లారు. ఆమె తలను గోడకేసి బాదారు. అనంతరం నలుగురూ కలిసి అత్యాచారం చేసి పరారయ్యారు. 


సెక్యూరిటీగార్డు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారంతా ఓ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.   

Updated Date - 2020-10-05T02:24:08+05:30 IST