క్రిస్మస్ వేడుకలో డీజే పార్టీ.. 200 మందిపై కేసు

ABN , First Publish Date - 2020-12-27T22:06:14+05:30 IST

ఫ్రీక్స్ అని పిలుస్తోన్న ఒక గ్రూప్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. వీరంతా పోజియూర్ బీచ్‌కి సమీపంలో నివసించే వారే. ‘‘బీచ్‌లో నిర్వహించిన ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవు. అంతే కాకుండా రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ఆ పార్టీ సుదీర్ఘ సమయం

క్రిస్మస్ వేడుకలో డీజే పార్టీ.. 200 మందిపై కేసు

న్యూఢిల్లీ: కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా పార్టీ నిర్వహించినందుకు గాను సుమారు 200 మందిపై కేసు నమోదైంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పోజియూర్ బీచ్‌లో ఈ నెల డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏమాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా పార్టీ నిర్వహిస్తున్న కారణంగా వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఫ్రీక్స్ అని పిలుస్తోన్న ఒక గ్రూప్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. వీరంతా పోజియూర్ బీచ్‌కి సమీపంలో నివసించే వారే. ‘‘బీచ్‌లో నిర్వహించిన ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవు. అంతే కాకుండా రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ఆ పార్టీ సుదీర్ఘ సమయం కొనసాగింది. కోవిడ్-19 ప్రమాకర పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ నిబంధనలు, అభ్యర్థనలు ఏమాత్రం పాటించకుండా చాలా ఎక్కువ మంది ఒక చోట చేరి పార్టీ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మందిపై కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-27T22:06:14+05:30 IST