కేంద్ర మంత్రి ఓటు వేసేంతలో ఈవీఎం మొరాయింపు... ఓటు వేయకుండా వెళ్లనంటూ...
ABN , First Publish Date - 2020-10-28T14:44:27+05:30 IST
బీహార్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో...
లఖీసరాయ్: బీహార్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఉదయాన్నే లఖీసరాయ్లోని ఒక ఆలయంలో పూజాదికాలు నిర్వహించి, ఓటు వేసేందుకు బయలు దేరారు. అయితే ఆయన పోలింగ్ బూత్కు చేరుకునేంతలో అక్కడి ఈవీఎం మొరాయించింది.
దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ఈవీఎం పాడయ్యిందని, మరమ్మతులు చేసేవరకూ వెయిట్ చేయాల్సివుందన్నారు. అయితే ఒక ఓటరుగా ఓటు వేసేంతవరకూ ఇక్కడి నుంచి వెనక్కివెళ్లేదిలేదని తెలిపారు. మహాఘట్బంధన్ నేతలు అభివృద్ధిపై చర్చ చేసేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. కాగా కొద్దిసేపటి తరువాత ఈవీఎంకు మరమ్మతు పూర్తి కావడంతో మంత్రి ఓటువేశారు.