కరోనా రిపోర్ట్: కర్ణాటకలో కొత్తగా 187 కేసులు
ABN , First Publish Date - 2020-06-02T00:33:34+05:30 IST
కర్ణాటకలో కొత్తగా 187 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 187 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 187 కేసులు కొత్తగా నమోదు కాగా ఒకరు మరణించారు. 110 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని కరోనా కేసులు 3,408కు చేరాయి. 1,328 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,026 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 52 మంది మృత్యువాత పడ్డారు.