జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-24T02:36:45+05:30 IST

జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు

జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు

శ్రీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొత్తగా మరో 148 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. కరోనా వల్ల ఇవాళ ఇద్దరు చనిపోగా, మొత్తం 87 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ లో 4,840 కరోనా కేసులు నమోదవగా, జమ్మూలో 1,396 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-06-24T02:36:45+05:30 IST