14 మంది మహిళా ఖైదీలకు కరోనా
ABN , First Publish Date - 2020-08-12T23:58:38+05:30 IST
14 మంది మహిళా ఖైదీలకు కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని బైధన్ జైలు నుంచి షాడోల్ జైలుకు తరలించిన కొన్ని రోజుల తరువాత 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయినట్లు తేలిందని సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం వారిని షాడోల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు షాడోల్ జిల్లా జైలు సూపరింటెండెంట్ జీకే నేతి పేర్కొన్నారు. 14 మంది మహిళా ఖైదీలను ఆగస్టు 9న బైధన్ జైలు నుంచి తరలించారు.