అసోంలో 13రోజుల్లో.. 13వేల పందుల మృతి
ABN , First Publish Date - 2020-05-11T07:38:22+05:30 IST
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎ్సఎఫ్) విజృంభణతో వివిధ ప్రాంతాల్లో 13 రోజుల్లో 13వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీని వల్ల వందలాది మంది పెంపకందారులు...
![అసోంలో 13రోజుల్లో.. 13వేల పందుల మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గువాహటి, మే 10: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎ్సఎఫ్) విజృంభణతో వివిధ ప్రాంతాల్లో 13 రోజుల్లో 13వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీని వల్ల వందలాది మంది పెంపకందారులు నష్టపోయారు. ఏఎ్సఎఫ్ అనేది పందులకు సోకే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. దీని బారిన పడిన పందులు తీవ్రమైన జ్వరం, రక్తస్రావంతో మరణిస్తాయి.