నడిచి నడిచి.. 12 ఏళ్ల బాలిక మృత్యు ఒడికి
ABN , First Publish Date - 2020-04-21T09:59:27+05:30 IST
నడచి.. 150 కిలోమీటర్ల దూరంలోని తన సొంత ఊరికి బయల్దేరిన పన్నెండేళ్ల బాలిక

బిజాపూర్ (ఛత్తీ్సగఢ్), ఏప్రిల్ 20: నడచి.. 150 కిలోమీటర్ల దూరంలోని తన సొంత ఊరికి బయల్దేరిన పన్నెండేళ్ల బాలిక మార్గమధ్యంలో మృతిచెందింది. ఆమె సొంతూరు ఛత్తీ్సగఢ్లోని బీజాపూర్. పొట్టకూటి కోసం తన ఊరి వాళ్లతో కలిసి తెలంగాణలోని కన్నాయిగూడకు చేరుకుంది. అక్కడి మిర్చి తోటల్లో పనిచేసేది. లాక్డౌన్ పొడిగించడంతో ఏప్రిల్ 15న కన్నాయిగూడ నుంచి బీజాపూర్కు బయల్దేరింది. మూడురోజులు నడిచి , తిండీతిప్పలు లేక నీరసించి సొంతూరి సరిహద్దుల్లో ప్రాణాలు వదిలింది.