కరోనా నెగెటివ్ అంటూ 12 మందికి డిశ్చార్జ్! 2 గంటల్లో మళ్లీ పాజిటివ్!

ABN , First Publish Date - 2020-07-22T23:15:23+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేసే పన్నెండు మంది కార్మికులు కరోనా పాజిటివ్‌గా తేలారు..అదీ కరోనా లేదంటూ స్థానిక ఆస్పత్రి వారిని డిశ్చార్జ్ చేసిన రెండు గంటల తరువాత..!

కరోనా నెగెటివ్ అంటూ 12 మందికి డిశ్చార్జ్! 2 గంటల్లో మళ్లీ పాజిటివ్!

కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేసే పన్నెండు మంది కార్మికులు కరోనా పాజిటివ్‌గా తేలారు..అదీ వ్యాధి లేదంటూ స్థానిక ఆస్పత్రి వారిని డిశ్చార్జ్ చేసిన రెండు గంటల తరువాత..! ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వారు రెండు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తొలి సారి నెగెటివ్ అని రావడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని ఇంటికి పంపించేశారు. రెండు గంటల తరువాత..రెండో కరోనా పరీక్ష ఫలితాలు రాగా అందులో పాజిటివ్ అని తేలింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము నడుచుకున్నామని అక్కడి డాక్టర్లు చెప్పారు. నిబంధనల ప్రకారం..కరోనా బారిన పడిన 10 అనంతరం..రోగిలో వరుసగా మూడు రోజుల పాటు వ్యాధి లక్షణాలు కనిబడకపోతే, పరీక్షలో నెగెటివ్ అని వస్తే డిశ్చార్చ్ చేయచ్చని వారు చెప్పారు. దాని ప్రకారమే తాము నడుచుకున్నామని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-22T23:15:23+05:30 IST