బస్తర్లో 11 మంది నక్సల్స్ లొంగుబాటు
ABN , First Publish Date - 2020-08-16T08:00:03+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెండు ప్రాంతాలలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీ్సగఢ్లోని బస్తర్ డివిజన్లో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు...

రాయ్పూర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెండు ప్రాంతాలలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీ్సగఢ్లోని బస్తర్ డివిజన్లో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒక మహిళ సహా ఐదుగురిపై రూ.16 లక్షల రివార్డు కూడా ఉంది. వీరంతా సుక్మా జిల్లాలోని సీనియర్ పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరు సుక్మా జిల్లాలోని ఎర్రబోర్ ప్రాంతానికి చెందిన బొడ్డు వెంకటేష్ అలియాస్ రాజీవ్ అని పోలీసులు తెలిపారు. రాజీవ్పై పలు కేసులున్నాయని 2010లో దంతేవాడలో జరిగిన భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న ఘటనలో కూడా ఇతడు భాగస్వామి అని పేర్కొన్నారు. ఇతడి తలపై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. అలాగే, దంతేవాడలో మరో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిని మహదేవ్ పోయం, సుఖ్రామ్, సుక్కి ఖోరామిగా పోలీసులు తెలిపారు. వీరి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.