కరోనా రిపోర్ట్: కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-26T23:15:17+05:30 IST
కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 43 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,283కి చేరింది. 748 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,489 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా 44 మంది మృత్యువాత పడ్డారు.