యూపీలో 10 మందికి కోవిడ్ స్ట్రెయిన్

ABN , First Publish Date - 2020-12-30T21:04:35+05:30 IST

కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో..

యూపీలో 10 మందికి కోవిడ్ స్ట్రెయిన్

లక్నో: కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 10 మందికి కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిలో ముగ్గురు నొయిడాకు చెందిన వారు కాగా, మీరుట్, బరైలీలో చెరొకరు, ఘజియాబాద్‌లో ముగ్గురు ఉన్నారు. రెండేళ్ల పాపలో కరోనా స్ట్రెయిన్ లక్షణాలు బయటపడటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు చెబుతున్నారు. స్టెయిన్ నేపథ్యంలో అదనపు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలోని అధికారులు, ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.


కాగా, యూకే నుంచి ఇటీవల తిరిగి వచ్చిన వారికి ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ 28 రోజుల పాటు హోమ్ క్యారంటైన్‌లో ఉంచనున్నట్టు తెలుస్తోంది. యూపీ ప్రభుత్వ అడ్వయిజరీ ప్రకారం, కొత్త స్ట్రెయిన్ పాజిటివ్ పేషెంట్లను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. మరోవైపు, బుధవారం ఉదయం దేశంలో 14 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 కేసులు ఢిల్లీలో, 7 బెంగళూరులో నమోదయ్యాయి. వీరంతా ఇటీవల యూకే నుంచి తిరిగి వచ్చినవారే.

Updated Date - 2020-12-30T21:04:35+05:30 IST