మూలికా కషాయంతో కరోనాకు చెక్!
ABN , First Publish Date - 2020-04-28T15:19:55+05:30 IST
కరోనా వైర్సను ఎదుర్కొనేలా ప్రజల రోగనిరోధక శక్తిని పెంచే మూలికా ఔషధ ఫార్ములాతో కేంద్ర ఆయుష్ శాఖ ముందుకొచ్చింది. దాని ఆధారంగా

రోగ నిరోధక శక్తిని పెంచే ‘ఆయుష్’ ఫార్ములా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 : కరోనా వైర్సను ఎదుర్కొనేలా ప్రజల రోగనిరోధక శక్తిని పెంచే మూలికా ఔషధ ఫార్ములాతో కేంద్ర ఆయుష్ శాఖ ముందుకొచ్చింది. దాని ఆధారంగా టీ పొడులు, మాత్రల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఓ లేఖ రాసింది. ‘ఆయుష్ క్వాత్’, ‘ఆయుష్ కుదినీర్’, ఆయుష్ జోషంద’ అనే జనరిక్ పేర్లతో విక్రయించాలని సూచించింది. వీటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది. కాగా, ఈ మూలికా ఔషధంలో తులసి ఆకుల పొడి, దాల్చిని చెక్క పొడి, శొంటి పొడి, మిరియాల పొడి ఉంటాయి. ఈ పొడులన్నీ కలిపిన 3 గ్రాముల మిశ్రమాన్ని 150 మిల్లీలీటర్ల మరిగించిన నీళ్లలో వేసి కషాయం (డికాక్షన్)గా చేసుకొని రోజూ ఒకటి లేదా రెండుసార్లు తాగొచ్చు. కాగా, కరోనా బారినపడకుండా రోగ నిరోధక వ్యవస్థను సమాయత్తం చేసుకునేందుకు వృద్ధులు తీసుకోవాల్సిన పలు మూలికా ఔషధాలను దాదీదాదా ఫౌండేషన్ సూచించింది. స్వర్ణ వసంత్ మాలతీ, చయన్ప్ర్షల వాడకంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంది.