భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-11-04T04:58:37+05:30 IST
భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు.
ఆచంట, నవంబరు 3: భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర అవసరాలకు వాడుకోవడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నారిపల్లి రమణరావు అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం మంగళవారం దాసిరెడ్డి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించి కార్మికులకు నెలకు రూ.10వేలు చొప్పున కరోనా ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.