నిబంధనలు నిల్.. రాత్రయితే ఫుల్!
ABN , First Publish Date - 2020-12-08T04:09:44+05:30 IST
జిల్లాలోని మద్యం దుకాణాల రూటే సెప రేటు.. ప్రభుత్వం ఒకటి చెబితే అధికారులు మరొకటి చేస్తున్నారు. ఆరంభం నుంచి నడుస్తోంది ఇదే. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. నిర్ణీత సమయానికి మించి అమ్మకాలు సాగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సొమ్ము వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడ నట్టు వ్యవహరిస్తున్నారు.

సమయం దాటినా మద్యం విక్రయాలు
అధిక ధరలకు అమ్మకాలు
పట్టించుకోని అధికారులు
మోసపోతున్న మందుబాబు
నిడదవోలు, డిసెంబరు 7 : జిల్లాలోని మద్యం దుకాణాల రూటే సెప రేటు.. ప్రభుత్వం ఒకటి చెబితే అధికారులు మరొకటి చేస్తున్నారు. ఆరంభం నుంచి నడుస్తోంది ఇదే. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. నిర్ణీత సమయానికి మించి అమ్మకాలు సాగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సొమ్ము వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడ నట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదు..
నిబంధనలు మీరి అమ్మకాలు..
నిబంధనల ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు విక్రయించాలి.ఆ తరువాత 8 నుంచి 9 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేసి ఆ రోజు జరిగిన లావాదేవీలకు సం బంధించిన లెక్కలు చూసుకోవాలి. అయితే సిబ్బంది మాత్రం ఆ గంటనూ సద్వినియోగం చేసుకుంటున్నారు.. అదనంగా సంపాదిస్తున్నారు.. మందు బాబుల జేబులు కొల్లగొడుతున్నారు. అదెలాగంటే రాత్రి 8 గంటల తరు వాత కూడా అధిక ధరలకు విక్ర యాలు సాగిస్తున్నారు.మద్యం విలువ ఆధారంగా రూ.30ల వరకూ అదన ంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూ డెం, యర్నగూడెం, పోలవరం, తాళ్ళ పూడి, పెనుగొండ, తణుకు ఇలా ఏ ప్రాంతంలో చూసినా ఒకటే కఽథ. అం దిన కాడికి మందుబాబులను దోచు కుంటున్నారు.ఒకవేళ ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేద్దామని ఫోను చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు మీరవద్దు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 8 గంటల తరువాత మద్యం విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం నేరం. ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా జరిగితే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
మోహనరావు, చాగల్లు డిపో అసిస్టెంట్ మేనేజర్