మద్యానికి బానిస..ఆపై అప్పుల బాధ..
ABN , First Publish Date - 2020-12-18T05:28:38+05:30 IST
మద్యానికి బానిసైన వ్యక్తి అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉరేసుకుని జూట్ మిల్లు కార్మికుడి ఆత్మహత్య
ఏలూరు క్రైం, డిసెంబరు 17 : మద్యానికి బానిసైన వ్యక్తి అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్లోని కొబ్బరితోట చేపల చెట్టు ప్రాంతానికి చెందిన తరగడ సూరిబాబు (38) జూట్ మిల్లులో పనిచేస్తున్నాడు. మరోవైపు అప్పులు చేశాడు. అప్పుల బాధలు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన అతను గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం వన్టౌన్ పోలీసులకు అందడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.