మద్దికి తలంబ్రాల ధాన్యం...
ABN , First Publish Date - 2020-12-26T05:18:44+05:30 IST
జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మి క సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది భద్రాచలంలో శ్రీరామనవమికి జరిగే రాముల వారి కల్యాణానికి తలంబ్రాల బియ్యంను అందజేస్తారు.
![మద్దికి తలంబ్రాల ధాన్యం...](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122511472925/12252020234835n20.jpg)
భద్రాద్రికి తరలించే తలంబ్రాల ధాన్యానికి పూజలు
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 25 : జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మి క సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది భద్రాచలంలో శ్రీరామనవమికి జరిగే రాముల వారి కల్యాణానికి తలంబ్రాల బియ్యంను అందజేస్తారు. మొట్టమొదటగా మద్ది ఆంజనేస్వామి వద్దకు ధాన్యం తీసుకువచ్చి పూజ చేయించి ఒలిచారు.ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వేంకటాచార్యులు, వేదపండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు దాకారపు గోపాలకృష్ణ, ముళ్ళ పూడి సత్యనారాయణ, ఆళ్ళ రమేష్ పాల్గొన్నారు.