వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం
ABN , First Publish Date - 2020-12-21T05:08:08+05:30 IST
కేంద్రం చట్టం చేసిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు రానున్న రోజుల్లో ఉరితాళ్లుగా మారనున్నాయని, వీటిని రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పేర్కొన్నారు.

ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 20 : కేంద్రం చట్టం చేసిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు రానున్న రోజుల్లో ఉరితాళ్లుగా మారనున్నాయని, వీటిని రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను, 2020 విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో 24 రోజు లుగా చేస్తున్న ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది రైతులకు సీపీఐ జిల్లా సమితి సంతాపాన్ని తెలిపింది. రామ చంద్రరావు పేటలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం సంతాప సభ నిర్వ హించారు. సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎన్.అమానుద్దీన్ అధ్య క్షత వహిం చిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకులు హేమశంకర్, కన్న య్య పాల్గొన్నారు.
వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామంటూ రైతు సంఘ ప్రతినిధులు ఢిల్లీ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. పవరుపేటలోని అన్నేభవనం వద్ద ఆదివారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. కె.శ్రీనివాస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ గుడివాడ నరసింహారావు, ఆలిండియా లాయర్స్ యూనియన్ నాయ కుడు కట్టా సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కె.రవీంద్ర, రైతు సంఘ ప్రతినిధులు మీసాల సత్యం, ఎస్.సత్యనారాయణ, గంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.