శిథిలావస్థకు రామిలేరు వంతెన
ABN , First Publish Date - 2020-12-30T04:57:47+05:30 IST
రాజుపేట–వసంతవాడ మార్గమధ్యంలో రామి లేరు మీద వంతెన శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులతో పాటు రైతులు కోరుతున్నారు.
పెదపాడు, డిసెంబరు 29: రాజుపేట–వసంతవాడ మార్గమధ్యంలో రామి లేరు మీద వంతెన శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులతో పాటు రైతులు కోరుతున్నారు. గతంలో వచ్చిన వరదలతో వంతెన ఇరువైపులా రక్షణగా వున్న రెయిలింగ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే సమయంలో రైతులు వ్యవసాయ పనుల మీద వెళ్లేటప్పుడూ ప్రమాదం బారినపడతామని ఆందోళన చెందుతున్నారు. కాలువ మీద వంతెన కాల్వకు సమాంతరంగా ఉండి ఇరువైపులా గట్లు ఎత్తుగా ఉండడంతో రాత్రిపూట ఇటుగా ప్రయాణించే కొత్తవారు ప్రమాదాల బారినపడుతున్నారని, వంతెన ఇరువైపులా రెయిలింగ్ మరమ్మతులు చేపట్టడంతో పాటుగా రాత్రిపూట కన్పించేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
