సముద్ర స్నానం చేస్తూ యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-14T04:40:22+05:30 IST
కృష్ణా జిల్లా పాలకాయితిప్ప గ్రామ సమీ పంలోని సముద్రతీరం వద్ద స్నానం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు.

కృష్ణా జిల్లాలో ఘటన.. మృతుడిది దుగ్గిరాల
కోడూరు, డిసెంబరు 13: కృష్ణా జిల్లా పాలకాయితిప్ప గ్రామ సమీ పంలోని సముద్రతీరం వద్ద స్నానం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ పి.రమేశ్ తెలిపిన వివ రాల ప్రకారం పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన రామాంజనేయులు, వారి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం సముద్ర తీరానికి చేరు కున్నారు. భోజనాలు చేసిన అనంతరం సముద్రంలో రామాంజనేయులు కుమారుడు మోహన్ వంశీకృష్ణ (18) స్నానం చేస్తుండగా అలల ధాటికి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పోలీసుసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీఆర్వో బాబు రావు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
