జిల్లాకు 1273 టన్నుల యూరియా దిగుమతి

ABN , First Publish Date - 2020-12-31T04:27:16+05:30 IST

జిల్లాకు 1273 మెట్రిక్‌ టన్నుల యూరియా దిగుమతి అయినట్టు జిల్లా రేకు అధికారి, తాడేపల్లిగూడెం ఏడీఏ పి మురళీకృష్ణ తెలిపారు.

జిల్లాకు 1273 టన్నుల యూరియా దిగుమతి

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 30 : జిల్లాకు 1273 మెట్రిక్‌ టన్నుల యూరియా దిగుమతి అయినట్టు జిల్లా రేకు అధికారి, తాడేపల్లిగూడెం ఏడీఏ పి మురళీకృష్ణ తెలిపారు. రైల్వే గూడ్స్‌ షెడ్‌ వద్ద ఎరువులను దిగుమతి చేశారు. 500 టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌కు, 773 టన్నులు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారని, మిగిలిన 159 టన్నులు తూర్పుగోదావరి కేటాయించారని తెలిపారు. 500 టన్నుల యూరియా రైతు భరోసా కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-31T04:27:16+05:30 IST