మహిళలకు ట్రక్కు ఆటోలు పంపిణీ
ABN , First Publish Date - 2020-12-12T04:31:59+05:30 IST
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.
కొవ్వూరు, డిసెంబరు 11: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డిక్కీ (దశిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) సంస్థ ఆధ్వర్యంలో అంగన్వా డీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేయడానికి 23 మంది మహిళలకు సబ్సిడీపై ట్రక్కు ఆటోలను అంది ంచారు. ఈ ఆటోలను మంత్రి వనిత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వాహనాలు అంది స్తున్నదన్నారు. కార్యక్రమంలో డిక్కీ ప్రెసిడెంట్ ఎ.ఆశీర్వాదం, కోఆర్డినేటర్ పి.ప్రవీణ్కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.