అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ వివాదాలు

ABN , First Publish Date - 2020-12-12T04:29:30+05:30 IST

రెడ్డిగూడెం భూవివాదానికి ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ వివాదాలు
గిరిజనుల అరెస్టును నిరసిస్తూ ప్రదర్శన చేస్తున్న గిరిజనులు

బుట్టాయగూడెం, డిసెంబరు 11: రెడ్డిగూడెం భూవివాదానికి ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అన్నారు. గిరిజన, గిరిజనేతరుల మధ్య పోడుభూముల విషయం  మూడు సంవత్సరాలుగా ఘర్షణలు జరుగుతున్న ప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రెడ్డిగూడెంలో జరిగిన ఘర్షణలో ఇరువర్గాలవారు ఫిర్యాదు చేసినా గిరిజనులను మాత్రమే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సమస్యను పరిష్కరించడానికి ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు.

గిరిజనుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌, ఆదివాసీ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. నాయకులు కుంజా శ్రీను, మొడియం శ్రీనివా సరావు, సోదెం మల్లారావు మాట్లాడుతూ అరెస్టు లకు ఐటీడీఏ అధికారులు బాధ్యత వహించా లన్నారు.  


Updated Date - 2020-12-12T04:29:30+05:30 IST