స్వచ్ఛమైన తాగునీరు సరఫరాలో విఫలం

ABN , First Publish Date - 2020-12-11T05:32:12+05:30 IST

నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించడంలో మునిసిపల్‌ అధికారులు విఫలమయ్యారని భార తీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కురెళ్ళ సుధాకర కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వచ్ఛమైన తాగునీరు సరఫరాలో విఫలం
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా

ఏలూరు టూ టౌన్‌, డిసెంబరు 10: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించడంలో మునిసిపల్‌ అధికారులు విఫలమయ్యారని భార తీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కురెళ్ళ సుధాకర కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ నగర ప్రజలు అనారోగ్యాల పాలవ్వడానికి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందే కారణమని ఆరోపించారు. తాగునీటి కాలుష్యం పరి ష్కరమయ్యే వరకు నగర ప్రజలకు మినరల్‌ వాటర్‌ ఉచితంగా అందజే యాలన్నారు. కృష్ణాకెనాల్‌లో వచ్చే దుర్గంధాన్ని అరికట్టాలన్నారు. నగరం లో ఉన్న 26 ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను పరి శుభ్రపర్చాలన్నారు. డంపింగ్‌ యార్డులో చెత్తను తగలబెట్టకుండా సహజ సిద్ధ ఎరువుగా మార్చే ప్ర క్రియ చేపట్టాలన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే వరకు, పారిశుధ్యాన్ని మెరుగుపరిచే వరకూ బీజేపీ పోరాడు తుందన్నారు. కార్యక్రమంలో శీర్ల భాస్కర్‌, బాడిద నారాయణ, దిడ్ల ఆంజిలో, నాగం శివ, వెంకటేశ్వరరావు, పసుపులేటి మనోహర్‌ ప్రసాద్‌, నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ, ఉలవల సాయి, తదితరులు పాల్గొ న్నారు. 

Updated Date - 2020-12-11T05:32:12+05:30 IST