జీలుగుమిల్లిలో రెండు శాఖ మధ్య స్థల వివాదం
ABN , First Publish Date - 2020-12-30T16:06:33+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెండు శాఖల మధ్య స్థలం వివాదం చోటు చేసుకుంది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెండు శాఖల మధ్య స్థలం వివాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న గ్రామ కంఠం స్థలంలో పోలీసు క్వార్టర్స్ కట్టాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ఈ క్రమంలో స్థలం మాదంటే మాదంటూ రెండు శాఖలు బోర్డుల ఏర్పాటు చేసుకున్నాయి.