-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari
-
ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-12-10T14:08:33+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. రాత్రి నుంచి ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. రాత్రి నుంచి ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు మొత్తం 592 కేసులు నమోదు అవగా...511 మంది డిశ్చార్జ్ అయ్యారు. విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 33 మందిని తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో వింత వ్యాధితో మృతి చెందిన వారిని సంఖ్య మూడుకు చేరింది.