పశ్చిమగోదావరి జిల్లాలో కొండచిలువ కలకలం
ABN , First Publish Date - 2020-11-13T16:16:26+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది. దాదాపు 10అడుగుల భారీ కొండచిలువ చేపల వలలో చిక్కింది. దీంతో స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్ని ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు.