మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2020-10-24T15:21:20+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఉండి బస్టాండ్లో గత రాత్రి మహిళ కాళ్ల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి బస్టాండ్లో గత రాత్రి మహిళ కాళ్ల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలు చెత్త కాగితాలు ఏరుకునే మహిళగా గుర్తించారు. రాత్రి బస్ స్టాండ్ అంధకారంలో ఉండటంతో బస్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా రెండు గంటలపాటు అంబులెన్స్ రాకపోవడంతో మహిళ నరకయాతన అనుభవించింది. చివరికి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.