వివాహేతర సంబంధం తెలిసిందని చంపేశాడు!
ABN , First Publish Date - 2020-12-21T04:20:57+05:30 IST
ఏపీ నిట్లో హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఏపి నిట్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
తాడేపల్లిగూడెం క్రైం, డిసెం బరు 20 : ఏపీ నిట్లో హత్య కేసును పోలీసులు ఛేదించారు. పట్టణ సీఐ ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్ రాష్ట్రం గన్టీ గ్రామానికి చెందన షాహిద్ ఆలిఖాన్తో పాటు మరి కొంత మంది ఏపీ నిట్లో పని చేసేందుకు వేరే కంపెనీ ద్వారా వచ్చారు. అయితే షాహిద్ ఆలిఖాన్ బంధువుతో ఫర్వేజ్ ఖాన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం షాహిద్ ఆలిఖాన్కు తెలిసింది. దీంతో అతన్ని హతమారిస్తే కానీ తన వివాహేతర సంబంధం కొనసాగదని భావించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఫర్వేజ్ ఖాన్కు ఈ నెల 11వ తేదీ రాత్రి షాహిద్ ఆలిఖాన్ పనిచేసే ప్రాంగణంలో ఒంటరిగా కనిపించాడు. దీంతో అతను ఒక రాడ్డుతో తలపై బలంగా కొట్టి పై ఫ్లోరు నుంచి కిందకు పడేసి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే పోలిసులు రంగ ప్రవేశం చేసి ఫర్వేజ్ ఖాన్ను అదుపులోకి తీసు కుని విచారించగా హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఆకుల రఘు వివరించారు.