మంచినీరే తాగుతున్నామా?
ABN , First Publish Date - 2020-12-12T04:33:09+05:30 IST
అసలే కరోనా కాలం.. అందునా జిల్లాలో వింత వ్యాధి కలవరం.. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని మంచినీటి చెరువులు, మంచినీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుల నుంచి మంచినీటిని సేకరించి వాటిని పరీక్షించేందుకు హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కలుషిత ప్రాంతాల్లో నీటి సేకరణ
పరీక్షకు హైదరాబాద్ పంపే ఏర్పాట్లు
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 11 : అసలే కరోనా కాలం.. అందునా జిల్లాలో వింత వ్యాధి కలవరం.. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని మంచినీటి చెరువులు, మంచినీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుల నుంచి మంచినీటిని సేకరించి వాటిని పరీక్షించేందుకు హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు గ్రామాల్లో మంచినీరు కాలుష్యం అయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నీటిని సేకరించే పనిలో పడ్డారు. వీటితో పాటు ప్రధాన కాలువల్లో నీటిని కూడా పరీక్షించేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్లోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, భీమడోలు మండలాల నుంచి నీటిని సేకరిస్తున్నారు.