షిర్డీ యాత్రికులకు శుభవార్త
ABN , First Publish Date - 2020-12-02T04:38:51+05:30 IST
నరసాపు రం– నాగర్సోల్ ఎక్స్ప్రెక్ పట్టాలెక్కింది.

పట్టాలెక్కిన నాగర్సోల్ ఎక్స్ప్రెస్
నరసాపురం,డిసెంబరు 1 : నరసాపు రం– నాగర్సోల్ ఎక్స్ప్రెక్ పట్టాలెక్కింది. ఎనిమిది నెలల తరువాత మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈ రైలు ఫ్లాట్ ఫాం ఎక్కింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు.ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపలేదు. అయితే ఇటీవల కొన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలకు, డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లను నడుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఎక్స్ప్రెస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి రోజున షిర్డీ యాత్రికులే కాకుండా విజయవాడ, హైదరాబాద్,వరంగల్ వెళ్లే ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ సమయానికి గంట ముందే స్టేషన్కు చేరుకున్న ప్రయాణికులందరికీ థర్మల్ స్కానింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతి ఇచ్చారు.