షిర్డీ యాత్రికులకు శుభవార్త

ABN , First Publish Date - 2020-12-02T04:38:51+05:30 IST

నరసాపు రం– నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెక్‌ పట్టాలెక్కింది.

షిర్డీ యాత్రికులకు శుభవార్త

పట్టాలెక్కిన నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌

 నరసాపురం,డిసెంబరు 1 : నరసాపు రం– నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెక్‌ పట్టాలెక్కింది. ఎనిమిది నెలల తరువాత మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈ రైలు ఫ్లాట్‌ ఫాం ఎక్కింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు.ఇప్పటి వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపలేదు. అయితే ఇటీవల కొన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలకు, డిమాండ్‌ ఉన్న రూట్లలో రైళ్లను నడుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తొలి రోజున షిర్డీ యాత్రికులే కాకుండా విజయవాడ, హైదరాబాద్‌,వరంగల్‌ వెళ్లే ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్‌ సమయానికి గంట ముందే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులందరికీ థర్మల్‌ స్కానింగ్‌ చేసిన తరువాతే లోనికి అనుమతి ఇచ్చారు.  

Updated Date - 2020-12-02T04:38:51+05:30 IST