రేపటి నుంచి గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు

ABN , First Publish Date - 2020-10-04T07:33:16+05:30 IST

పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్‌ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు.

రేపటి నుంచి గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు

పశుసంవర్థక శాఖ డీడీ విశ్వేశ్వరరావు



పెంటపాడు, అక్టోబరు, 3 : పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్‌ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్‌ పరిధిలో 2,01,000 గొర్రెలు, 12,000 మేకలకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ వ్యాధి సోకే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్‌ వేయనున్నామన్నారు.గొర్రెలు, మేకల మందల వద్దకు పశుసంవర్థక శాఖ సిబ్బంది స్వయంగా వెళ్లి పీపీఆర్‌ వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. 

Updated Date - 2020-10-04T07:33:16+05:30 IST