3.77 లక్షల క్యూసెక్కులు నీటి విడుదల

ABN , First Publish Date - 2020-09-28T11:52:52+05:30 IST

గోదావరికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం 9.65 అడుగుల నీటి మట్టం నమోదైంది.

3.77 లక్షల క్యూసెక్కులు నీటి విడుదల

కొవ్వూరు, సెప్టెంబరు 27 : గోదావరికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం  9.65 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఈ మేరకు 175 గేట్లను కొంత మేర ఎత్తి  3 లక్షల 77 వేల 483 క్యూసెక్కుల  నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ దిగువన ఉన్న మూడు ప్రధాన డెల్టాలకు సాగు అవసరాల నిమిత్తం 9 వేల 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.


తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1800, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు గోదావరి హెడ్‌ వాటర్‌ వర్స్క్‌ ఈఈ ఆర్‌.మోహనరావు తెలిపారు. 

Updated Date - 2020-09-28T11:52:52+05:30 IST