దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది
ABN , First Publish Date - 2020-04-28T09:40:57+05:30 IST
వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యాన్ని ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.

గణపవరం, ఏప్రిల్ 27 : వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యాన్ని ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు. ముగ్గళ్ల సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తక్కువ ధరలకు నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. గణ పవరం సొసైటీలో నిత్యావసరాల విక్రయ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కొనిశెట్టి వెంకట రమేష్బాబా ప్రారంభించారు.