తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2020-05-18T11:06:22+05:30 IST
మొక్కజొన్న రైతుల సమస్యలు చెప్పుకుందా మని వెళ్లితే అవమానించిన చింతలపూడి తహసీల్దార్ను
ఏలూరు కార్పొరేషన్, మే 17 : మొక్కజొన్న రైతుల సమస్యలు చెప్పుకుందా మని వెళ్లితే అవమానించిన చింతలపూడి తహసీల్దార్ను తక్షణం సస్పెండ్ చేయాలని, రైతుల నుంచి మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం వవర్పేట అన్నే భవనం వద్ద మొక్కజొన్న రైతులు ప్లకార్డులతో ఆందోళన చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.