ప్రభుత్వం చేతులెత్తేసింది: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి
ABN , First Publish Date - 2020-07-27T16:36:44+05:30 IST
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా..

భీమవరం టౌన్: కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. ఆదివారం కరోనా పోరాట యోధులకు, బాధితులకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రయత్నం కూడా చెయ్యకపోవడం సిగ్గుచేటన్నారు.
కరోనా విధుల్లో చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లు (డాక్టర్లు, నర్సులు, పోలీస్, పారిశుధ్య సిబ్బంది, మీడియా, రెవెన్యూ, మునిసిపల్) ఉద్యోగులకు రూ.50 లక్షలు పరిహారం వెంటనే చెల్లించాలని, జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని, డాక్టర్లకు, నర్సులకు రక్షణకు మాస్కులు, ఇతర పరికరాలు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.