సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

ABN , First Publish Date - 2020-11-14T04:50:31+05:30 IST

నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ ఖలీల్‌ డిమాండ్‌ చేశారు.

సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత
పాలకొల్లు మసీదు వద్ద ప్రార్థన చేస్తున్న నిమ్మల, అంగర, ముస్లింలు

భీమవరం, నవంబరు 13 : నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ ఖలీల్‌ డిమాండ్‌ చేశారు. పెద్ద మసీదు వద్ద మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఎండీ ఫిరోజ్‌, ఎస్‌కే.రబ్బానీ, ఎస్‌కే.రఫీ, మైలాబ త్తుల ఐజాక్‌బాబు, మద్దుల రాము, తదితర నాయకులు పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌, నవంబరు 13: ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కుటుంబానికి ఆత్మశాంతి కోరుతూ పెద్ద మసీదు వద్ద ముస్లిం మతపెద్దలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల, ఎమ్మెల్సీ అంగర శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాత్రి బ్రాడీపేటలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-14T04:50:31+05:30 IST