అఖిల భారత టాక్స్‌ ప్రాక్టీషనర్ల సమాఖ్య అధ్యక్షుడిగా ‘మల్లాది’

ABN , First Publish Date - 2020-12-06T05:38:47+05:30 IST

అఖిల భారత టాక్స్‌ ప్రాక్టీషనర్ల సమాఖ్య 23వ జాతీయ సదస్సు శనివారం వర్చువల్‌ విధానంలో జరిగింది.

అఖిల భారత టాక్స్‌ ప్రాక్టీషనర్ల సమాఖ్య అధ్యక్షుడిగా ‘మల్లాది’

ఏలూరు రూరల్‌, డిసెంబరు 5 : అఖిల భారత టాక్స్‌ ప్రాక్టీషనర్ల సమాఖ్య 23వ జాతీయ సదస్సు శనివారం వర్చువల్‌ విధానంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్యరాజన్‌ పాల్గొని ప్రసంగించారు. అనంతరం సమాఖ్య నూతన అధ్యక్షుడిగా 2020–21 ఏడాదికి ఏలూరు పవర్‌పేటకు చెందిన ఆడిటర్‌ మల్లాది శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి వినీత్‌ శరణ్‌ వర్చువల్‌ విధానంలోనే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం లో సమాఖ్య మాజీ అధ్యక్షులు, పలువురు అధికారులు, కేబినెట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికైన శ్రీనివాసరావును పలువురు అభినందించారు.  

Updated Date - 2020-12-06T05:38:47+05:30 IST