జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సూపర్ శానిటేషన్
ABN , First Publish Date - 2020-11-22T05:13:07+05:30 IST
ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలు, ఓపీలు ప్రారంభించనున్న విషయం విదితమే.
ఏలూరు క్రైం, నవంబరు 21 : ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలు, ఓపీలు ప్రారంభించనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి మొత్తాన్ని సూపర్శానిటేషన్ చర్యలు చేపట్టారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేసి కరోనా వైరస్ను వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశారు. అయితే క్రమేపీ కరోనా కేసుల అడ్మిషన్లు తగ్గిపోవడంతో సాధారణ వైద్య సేవల నిర్వ హణకు అధికారులు చర్యలు చేపట్టారు.