ఉద్యోగంరావడంలేదని..
ABN , First Publish Date - 2020-12-14T04:30:21+05:30 IST
ఏ ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఒక యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

ఏలూరులో యువకుడి ఆత్మహత్య
ఏలూరు క్రైం, డిసెంబరు 13 : ఏ ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఒక యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన పూతి తులసీ గణేశ్ (23) డిగ్రీ చదివి ఖాళీగా ఉం టున్నాడు. తండ్రి రవికృష్ణ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా తల్లి రాణి, చెల్లితో కలిసి ఉంటున్నారు. ఆదివారం రాత్రి తులసీ గణేశ్ ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. పరిస్థితిని గమనించిన అతని సోదరి, కుటుంబీకులు ఏలూరు ప్రభు త్వాసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.ఈ మేరకు సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ కిశోర్బాబు ఆసుపత్రికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.