నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం
ABN , First Publish Date - 2020-11-01T04:45:25+05:30 IST
రాష్ట్ర అవతరణ దినోత్స వాన్ని నవంబరు 1న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 31 : రాష్ట్ర అవతరణ దినోత్స వాన్ని నవంబరు 1న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్కూలు ప్రాంగణంలో ఆదివారం ఉదయం రాష్ట్ర అవతరణ వేడు కలను నిర్వహించాల్సిన బాధ్యత స్కూలు హెచ్ఎంలు, టీచర్లదేనని స్పష్టం చేశారు. స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆహ్వానించి సోమ వారం నుంచి పునః ప్రారంభ మవుతున్న పాఠశాలల్లో చేపట్టిన చర్యలు గురించి వివరించాలని సూచించారు.