కాకినాడలో శ్రీలంక బోటు పట్టివేత
ABN , First Publish Date - 2020-07-13T18:02:14+05:30 IST
భారత సముద్ర జలాల్లోకి శ్రీలంక బోటు దూసుకొచ్చింది.
కాకినాడ : భారత సముద్ర జలాల్లోకి శ్రీలంక బోటు దూసుకొచ్చింది. అప్రమత్తమైన కాకినాడ కోస్టు గార్డ్ బృందం పట్టుకుంది. చేపల వేట కోసం కేజీ బేసిన్ పరిధి వరకు ఇందువర ఫిషింగ్ బోట్ వచ్చేసింది. భారత కోస్ట్ గార్డ్ బృందాన్ని చూసి పరారయ్యేందుకు శ్రీలంక మత్స్యకారులు ఆరుగురు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి మరీ ప్రియదర్శిని గస్తీ నౌక ద్వారా కోస్ట్ గార్డ్ పోలీస్లు పట్టుకున్నారు. ఆ మత్స్యకారుల నుంచి భారీ టునా చేపను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.