అధ్వాన రోడ్లు పునర్నిర్మించండి
ABN , First Publish Date - 2020-12-02T04:46:01+05:30 IST
అధ్వానంగా మారిన రోడ్లను తిరిగి నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు డిమాండ్ చేసారు.

పాలకొల్లు అర్బన్, డిసెంబరు 1 : అధ్వానంగా మారిన రోడ్లను తిరిగి నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు డిమాండ్ చేసారు. సీపీఎం ఆధ్వర్యంలో దిగమర్రు బైపాస్ వద్ద మంగళవారం కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాత్రి సమయాల్లో గోతుల్లో పడి మోటారు సైకిళ్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. జవ్వాది శ్రీనివాసరావు, కానేటి బాలరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.