అందుబాటులో వరి విత్తనాలు

ABN , First Publish Date - 2020-11-22T04:32:03+05:30 IST

దాళ్వా సాగుకు వరి విత్తనాలు 100 బస్తాలు అందుబాటులో ఉన్నట్టు కొంతేరు సొసై టీ అధ్యక్షుడు నిమ్మకాయల సత్యనారా యణ తెలిపారు.

అందుబాటులో వరి విత్తనాలు
విత్తనాలు పరిశీలిస్తున్న సొసైటీ సభ్యులు

యలమంచిలి, నవంబరు 21: దాళ్వా సాగుకు వరి విత్తనాలు 100 బస్తాలు అందుబాటులో ఉన్నట్టు కొంతేరు సొసై టీ అధ్యక్షుడు నిమ్మకాయల సత్యనారా యణ తెలిపారు. పెదపాడు విత్తనశుద్ధి కేంద్రం నుంచి ఎంటీయూ 1121 రకం కొంతేరు సొసైటీ ద్వారా రైతులకు అం దుబాటులో ఉంచినట్టు తెలిపారు. 30 కిలోల బస్తా రూ.980 ధరకు విక్రయిస్తు న్నట్టు తెలిపారు. దాళ్వా సాధ్యమైనంత ముందుగా ప్రారంభిస్తే సాగునీటి ఇబ్బందులను అధిగమించవచ్చని తెలిపారు. శనివారం సొసైటీ గిడ్డంగిలోని వరి విత్తనాలను సభ్యులతో  కలిసి పరిశీలించారు.

Updated Date - 2020-11-22T04:32:03+05:30 IST