ఏలూరు నగరంలో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-11-27T05:21:45+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో నగర వాసులు బేజార య్యారు. బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై ఆపై గురువారం రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది.

ఏలూరు కలెక్టరేట్, నవంబరు 26: నివర్ తుఫాన్ ప్రభావంతో నగర వాసులు బేజార య్యారు. బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై ఆపై గురువారం రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది. నగర వాసులు, విద్యార్థులు, దూర ప్రాంత ప్రయాణికులు వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ఈదురుగాలులు, భారీ వర్షాలకు తోడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేశారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటికి పల్లపు ప్రాంతాలతో పాటు పవర్పేట, ఆర్ఆర్పేట, పత్తేబాద, ప్రభుత్వాస్పత్రి వైపు వెళ్లే మార్గాలన్నీ జలమయం అయ్యాయి. మురుగు డ్రెయిన్లన్నీ పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీటిలో మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.