ప్రజలు బయటకు రావద్దు : ఎమ్మెల్యే గ్రంధి
ABN , First Publish Date - 2020-04-28T09:40:09+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను ప్రజలు అర్ధంచేసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎమ్మెల్యే గ్రంధి

భీమవరం టౌన్, ఏప్రిల్ 27 : కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను ప్రజలు అర్ధంచేసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అను మానితులు ఆందోళన చెందవద్దన్నారు. వైద్య సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో సిబ్బందిక కూడా టెస్టులు నిర్వహించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు రోజులపాటు బంద్ ప్రకటించినట్లు తెలిపారు. కేవలం 24 గంటలు అందుబాటులో ఉండే మెడికల్ షాపులు మినహా ఇతర మెడికల్ షాపులు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరవడానికి వీలులేదన్నారు.