భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T04:41:11+05:30 IST
నరసాపురం పార్లమెంట్ పరిధిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం నడిబొడ్డున ఉన్న భీమవరంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.
భీమవరం / టౌన్, డిసెంబరు 1: నరసాపురం పార్లమెంట్ పరిధిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం నడిబొడ్డున ఉన్న భీమవరంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ భీమవరం టౌన్ కన్వీనర్ దండు శ్రీనివాసరాజు, జిల్లా యూత్ కన్వీనర్ ధనాల సిద్ధూ డిప్యూటీ తహసీల్దార్ గ్రంధి పవన్కుమార్కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కోరారు. కనుమూరి వెంకట పతిరాజు, మోకా బాలకృష్ణ, వాటాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటుపై శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రజాభిప్రా య సేకరణ చేపట్టారు. ఉండపల్లి రమేష్ నాయుడు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు.